జగన్ కు మంత్రి ధర్మాన బిగ్ షాక్..వచ్చే ఎన్నికల్లో పోటీపై ప్రకటన !

-

జగన్ కు మంత్రి ధర్మాన బిగ్ షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీపై కీలక ప్రకటన చేశారు ధర్మాన. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని జగన్‌ కు చెప్పానని.. కానీ, నన్ను పోటీచేయాలని జగన్ కోరాడని వెల్లడించారు. శ్రీకాకుళం లోని కంపొస్ట్ కాలనీలో అర్బన్ పిహెచ్సీని ప్రారంబించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వంలో ప్రజలందరూ హాయిగా జీవించే ప్రోగ్రాంలు నడుస్తున్నాయన్నారు. చెప్పింది చేస్తున్నాం… కార్యక్రమం అమలుచేసి వస్తున్నాయా లేదా అంటూ గడప గడపకూ వచ్చి అడుగుతున్నాం అన్నారు. ప్రజలు ఒక్కసారి ఆలొచించాలని కోరారు. ఈ ప్రభుత్వంలో పార్టీ వర్కర్స్ నష్టపోయారని అన్నారు. గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా ప్రజల చాకరీ చేస్తున్నారని అన్నారు మంత్రి ధర్మాన. నయాపైసా ఆశించకుండా పార్టీ కార్యకర్తలు పనిచేసారని కొనియాడారు. వాలంటీర్లు అంతే స్దాయిలో నేడు పనిచేస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news