పొలిటికల్ పార్టీలకు బిగ్ షాక్… ర్యాలీలు,పాదయాత్రలు, రోడ్ షోలు లేకుండానే 5 రాష్ట్రాల ఎన్నికలు

-

పొలిటికల్ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఇవాళ మధ్యాహ్నం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం కమిషనర్ సుశీల్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ… ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం పై… పరిమితులు విధిస్తున్నట్లు ప్రకటించారు.

జనవరి 15వ తారీఖు వరకు ఇలాంటి పొలిటికల్ ర్యాలీలు, రోడ్డు షో లు, పాదయాత్రలు, సైకిల్ ర్యాలీ ల కు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. నామినేషన్ వేసేందుకు కూడా యాత్రగా వెళ్లవద్దని ఆదేశించారు. జనవరి 15వ తేదీ తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని ఆయన వివరించారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ కోసం ఐదుగురు కంటే ఎక్కువ మంది వెళ్ళకూడదని చెప్పారు. ఈ రూల్స్ ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉత్తర ప్రదేశ్ 403, మణిపూర్ 70 , గోవా 60, పంజాబ్ 117, ఉత్తరంఖడ్ 40 అసెంబ్లీ స్థానాలకు  ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు వివరించారు ఎన్నికల కమిషన్.

 

5 states election dates

Phase 1: Feb 10
Phase 2: Feb 14 (Punjab, UK, Goa)
Phase 3: Feb 20
Phase 4: Feb 23
Phase 5: Feb 27 (Manipur)
Phase 6: March 3 (Manipur)
Phase 7: March 7

Results : march 10

Read more RELATED
Recommended to you

Latest news