చంద్రబాబుకు బిగ్ షాక్… వైసీపీలో చేరిన కీలక నేత

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో టీడీపీ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఇప్పటికే కీలక నేతలందరూ టీడీపీ కి గుడ్‌ బై చెప్పి అధికార వైసీపీ పార్టీ లో చేరగా… తాజాగా మరో షాక్‌ తగిలింది. టీడీపీ కీలక నేత, నగర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న మార్కెట్‌ దొరైరాజ్‌ తన అనుచరులతో కలిసి శుక్రవారం వైసీపీ లో చేరారు.

పద్మావతి పురం నుంచి ర్యాలీగా తరలివచ్చి.. ఎమ్మెల్యే భూమాన నివాసం లో పార్టీ కండువా కప్పుకున్నారు. దొరైరాజ్‌ కుటుంబానికి వైసీపీలో సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్ఏ భూమన కరుణాకర్‌ రెడ్డి హామీ ఇచ్చారు. 1991 నుంచి 2002 వరకు దొరైరాజ్‌ తన అనుచరుడిగా నే ఉన్నారని.. అనంతరం పలు కారణాల రీత్యా టీడీపీ లోకి వెళ్లారన్నారు. వైసీపీ పార్టీ తోనే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని వివరించారు. ఆయన తో పాటు పరసాల వీధి ఆనంద్‌, శ్రీధర్‌ రాయల్‌, ప్రసాద్, శ్యామమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news