ShyamSinghaRoy : “శ్యామ్ సింగరాయ్” దీవాళి ట్రీట్.. ముగ్గురు భామలను దించేశాడుగా !

-

నేచురల్ స్టార్ నాని గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. వరుస సినిమాలతో ప్రస్తుతం నాని ఫుల్ బిజీగా అయిపోయారు. ఇటీవల టక్ జగదీష్ సినిమాతో… ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని… పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమా చేస్తున్నాడు హీరో నాని. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది.

అయితే ఈ సినిమా రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి, మృతి శక్తి మరియు మడోన్నా సెబాస్టియన్ లు ముగ్గురు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా శ్యామ్ సింగరాయ్ సినిమా నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. దీపావళి పండుగ కానుకగా ఈ సినిమా నుంచి ఈ అప్డేట్ ఇచ్చేసింది చిత్రబృందం.

ఈ సినిమాలో నటిస్తున్న ముగ్గురు హీరోయిన్ల పోస్టర్లను వదిలింది శ్యామ్ సింగరాయ్ చిత్రబృందం. ఇక ఈ పోస్టర్లలో సాయి పల్లవి చాలా ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తుండగా… కృతి శెట్టి మాత్రం కాలేజీ అమ్మాయిల కనువిందు చేస్తోంది. అలాగే మడోన్నా సీరియస్ లుక్ లో కనిపించారు. మొత్తానికి ముగ్గురు హీరోయిన్లలో పోస్టర్లను వదిలి… అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది చిత్ర బృందం. కాగా ఈ సినిమా డిసెంబర్ 24 తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news