బిగ్ బాస్: ఈ షో అందుకే అలా తగలెడింది..షానీ సంచలన వ్యాఖ్యలు..!

-

సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ల పారితోషకాలు కూడా ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా భారం చొప్పున పారితోషకం ఇచ్చిన సినిమాలలో, సీరియల్స్ లో , సోషల్ మీడియాలో వారికి ఉన్న క్రేజ్ ను బేస్ చేసుకుని బిగ్ బాస్ నిర్వహకులు కూడా వారికి పారితోషకం ఫిక్స్ చేస్తూ ఉంటారు. హౌస్ లో ఎన్ని వారాలు వుంటే అంత డబ్బు వస్తుంది. ఒకవేళ చివరి వరకు ఉంటే ఎక్స్ట్రా ప్రైజ్ మనీ కూడా వస్తూ ఉంటుంది. అయితే వారం చొప్పున ఇచ్చే డబ్బు ఒక్కొక్కరి రేంజ్ బట్టి మారుతూ ఉంటుంది. కంటెస్టెంట్లకు ఇంత పారితోషకం ఇస్తున్నారు అనే విషయం సాధారణంగా బయటకు రాదు. కానీ కొంతమంది కంటెస్టెంట్లు చెప్పేదాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు.

ఈ క్రమంలోని అవినాష్ కూడా రూ.50 లక్షలు ఇచ్చినట్టు బయట పెట్టాడు.. అంటే వారానికి ఇతడికి బాగానే ముట్ట చెప్పారు బిగ్ బాస్. ఇక శ్రీముఖి కూడా.. అలాగే షన్నూ కి తెలుపుతూ వచ్చారు.. ఇక అలా కంటెస్టెంట్ల మధ్య ఉండే రేంజ్ ను బట్టి పారితోషకం కూడా మారుతూ ఉంటుంది. బిగ్బాస్ సీజన్ 6 విషయానికి వచ్చేసరికి చాలామంది తెలియని ముఖాలు కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.. ఇక చంటి, ఫైమా , రేవంత్ బాలాదిత్యా వంటి వారు మాత్రమే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. కామెడీ ఎంటర్టైన్మెంట్ షో ద్వారా బుల్లితెరపై నిత్యం అలరించే ఫైమా, చంటి పాపులారిటీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక బాలాదిత్య ఎలాగో హీరో కాబట్టి అతని గురించి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు . రేవంత్ కూడా సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి సుపరిచితుడే.

ఇక మిగతా కంటెస్టెంట్ లందరూ సీరియల్స్, సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ప్రతి ఒక్కరు సీరియల్స్ చూస్తారని రూలేమీ లేదు.. కాబట్టి వారు కూడా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేరు. తాజాగా బయటకు వచ్చిన షాని కూడా పారితోషకం మీద స్పందించాడు. ఎంత ఇస్తున్నారు అనేది బయటకు చెప్పద్దని నిబంధన కూడా ఉందట. అయితే షానీ మాత్రం మినిమం రూ. 15000 మాక్సిమం రూ.70 నుంచి రూ. 80,000 ఉండవచ్చని అలాంటి కంటెస్టెంట్లను మాత్రమే తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. రేవంత్ కు ఎక్కువగా ఇచ్చి ఉంటారని , రాజశేఖర్, ఇనయా వంటి వారికి మరీ తక్కువగా ఇచ్చి ఉంటారని కూడా చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం షానీ చేసిన పారితోషకం పై కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news