రొమాంటిక్ చిత్ర యూనిట్ కు షాక్.. పోస్టర్లు తొలగించకపోతే క్రిమినల్ కేసులు..!

-

రొమాంటిక్ చిత్ర యూనిట్ కు కడప జిల్లా 5వ డివిజన్ అదనపు జడ్జి ఎస్ఎండి లక్ష్మి షాకిచ్చారు. కడప జిల్లాలో రాయచోటి పట్టణమంతా రొమాంటిక్ సినిమా రిలీజ్ సందర్భంగా పోస్టర్లను అంటించారు. ఆ పోస్టర్లను గమనించిన జడ్జి ఎస్ఎండీ లక్ష్మి థియేటర్స్ యజమానులను కోర్టుకు పిలిచి పోస్టర్లను తొలగించాలని వార్నింగ్ ఇచ్చారు. పట్టణంలో అసభ్య కరంగా ఉన్న పోస్టర్ లు యువతను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు.

ఒకవేళ ఆ సినిమా పోస్టర్లు తొలగించకపోతే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. దాంతో రొమాంటిక్ సినిమా పోస్టర్లపై వైట్ పేపర్లు అతికించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రొమాంటిక్ సినిమాలో పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించారు. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ కథను అందించారు. ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా పోస్టర్లు కాస్త పూరి మార్క్ కు దగ్గరగా ఉన్నాయి. మరి పోస్టర్ లను తొలగించడంపై చిత్రయూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. గతంలో కూడా అర్జున్ రెడ్డి సినిమా పోస్టర్లపై ఇలాంటి వివాదమే నెలకొన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news