బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం: బీహార్ సీఎం

-

తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీ పైన మరియు ప్రధాని నరేంద్ర మోదీ పైన విమర్శలను గుప్పించారు. ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో దేశ వ్యాప్తంగా బీజేపీ ఓడిపోవడం ఖాయం అంటూ చెప్పారు. ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో బీజేపీని లేకుండా చేస్తామని శపధం చేశారు నితీష్ కుమార్. పార్లమెంట్ సెషన్స్ కు మొదటి రెండు రోజులు మోడీ రాకపోవడం పైన నితీష్ కుమార్ స్పందిస్తూ, బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు అన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడడంతో మోదీ మరియు బీజేపీ నాయకులకు వెన్నులో వణుకు పుట్టిందని అందుకే పార్లమెంట్ కు రాలేదన్నారు. దేశం అభివృద్ధి పదంలో నడవాలంటే INDIA కూటమి అధికారంలోకి రావడంతోనే సాధ్యం అవుతుందన్నారు నితీష్ కుమార్. బీజేపీ ప్రభుత్వం ప్రకటనలు మరియు ప్రచారాల పైనే తమ దృష్టిని కేంద్రీకరించాయన్నారు..

ఇలాంటి ప్రభుత్వం ఈ దేశ ప్రజలకు అవసరం లేదు.. అందుకే అందరూ గట్టిగా అలోచించి 2024 లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news