హుజురాబాద్ పోలింగ్ పై సీబీఐ విచారణ చేయాలి : ఈసీకి బీజేపీకి ఫిర్యాదు

-

హుజూరాబాద్‌లో EVM తరలింపు వివాదంపై సీఈవో శశాంక్‌ గోయల్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. ఎన్నికల్లో జరిగిన ఘటనలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ ని కలిసిన బీజేపీ నేతలు డీకే అరుణ, రాజాసింగ్, ఎన్ రామచందర్ రావు.. టీఆర్‌ఎస్‌ పార్టీ పై ఫిర్యాదు చేశారు. హుజురాబాద్ పోలింగ్ తర్వాత వీవీ ప్యాట్ల ను వేరే వాహనంలోకి తరలించడం పై ఫిర్యాదు చేశారు. రాత్రి జరిగిన వీవీ ప్యాట్ల తరలింపు ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

etela
etela

టిఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఫిర్యాదు చేశారు. హుజురాబాద్ పోలింగ్ లో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని బిజెపి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్నికల ప్రధాని అధికారి శశాంక్ గోయల్ కి వినతి పత్రం అందజేశారు.  సిబిఐ విచారణ తో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరిన బిజెపి… కౌంటింగ్ సమయంలో మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news