ఉద్రిక్తత.. సీపీఎం ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు

-

త్రిపురలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో సీసీఎం ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా త్రిపురలో సీపీఎం ఆందోళన నిర్వహించింది. సీపీఎం నేతలు ప్రసంగించే సమయంలో దుండగులు దాడి చేశారు. రాడ్ లతో అందరినీ విచక్షణా రహితంగా కొట్టారు. బీజేపీ కార్యకర్తలే దాడి చేశారని సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు.

ఆగ్రహంతో బీజేపీ కార్యకర్తలపై కూడా సీపీఎం కార్యకర్తలు దాడి చేశారు. సీపీఎం ఎమ్మెల్యే సుధాన్ దాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్యే దాస్ తల, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. ఆపేందుకు యత్నించిన బీజేపీ మండల అధ్యక్షుడికి కూడా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘర్షణలను అదుపుచేసేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. సీపీఎం దాస్ ఇంటిపైనా బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో ఎమ్మెల్యే భార్యకు కూడా గాయాలయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news