బిజెపి దేవుళ్ల పేరు చెప్పుకొని రాజకీయం చేస్తున్న పార్టీ – మంత్రి ఎర్రబెల్లి

-

నేడు జనగామ జిల్లా పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని, నూతన ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలకుర్తిని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని అన్నారు.

కవులు, కళాకారులను గుర్తించిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. 63 కోట్లరూపాయలతో బొమ్మెర, పాలకుర్తి, వాల్మీడిని టూరిజం హబ్ గా తీర్చి దిద్దుతున్నామన్నారు. బిజెపి మతతత్వ పార్టీ అని, దేవుళ్ళ పేరు చెప్పుకుని రాజకీయం చేస్తున్న పార్టీ అని ఆరోపించారు. దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని.. మహ శివరాత్రికి కేటీఆర్, హరీష్ రావు పాలకుర్తికి వస్తారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news