పొత్తులపై తుది నిర్ణయం హైకమాండ్ దే: బీజేపీ నేత సత్యకుమార్

-

ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ జనసేన పార్టీతో కలిసి పొత్తు పెట్టుకుని పోటీ చేస్తుందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు టీడీపీతోనూ కలిసి వెళ్లేందుకు పవన్ సుముఖంగా ఉండగా ఇప్పుడు బీజేపీ నేత సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈయన ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పొత్తుల గురించి ఎవరు ఎన్ని మాట్లాడినా.. చివరికి పొత్తులపై తుది నిర్ణయం మాత్రం బీజేపీ అధిష్టానానిదే అని స్పష్టం చేశాడు. అంతే కాకుండా ఎన్నికలు ఇంకో రెండు నెలల్లో జరుగుతాయి అనగా, అప్పుడు ఈ పొత్తులపై అధిష్టానం మాట్లాడుతుందని చెప్పారు సత్య కుమార్.

దీనితో జనసేన ఎవరితో కలిసి వెల్లాలన్న విషయం సందిగ్ధంలో ఉన్నట్లే. అయితే పవన్ ఇటీవల చేసిన వ్యాఖ్యల ప్రభావం బాగా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news