ఆ రెండు పార్టీలు టిఆర్ఎస్ తొత్తులే : జగ్గారెడ్డి

-

తాజాగా టిఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు. ఉన్న సెక్రటేరియట్ లోనే సరిగ్గా పాలన చేయడం లేదు ఇక కొత్త సెక్రటేరియట్ లో ఏం పని చేస్తారు అంటూ ప్రశ్నించారు. సెక్రటేరియట్ లో ఉన్న గుడికి కూల్చేస్తే అడిగే ధైర్యం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు లేదని కానీ… చిన్న మసీదు కూల్చేస్తే మాత్రం అసదుద్దీన్ రాజకీయం చేసే వారు అంటూ వ్యాఖ్యానించారు జగ్గారెడ్డి.

ఓవైపు కరోనా వైరస్ తో ప్రజలందరూ భయాందోళనలో బతుకుతుంటే… ముఖ్యమంత్రి కేసీఆర్ వందల కోట్లు ఖర్చుపెట్టి సెక్రటేరియట్ కడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 500 కోట్లు కరోనా బాధితులకు పెడితే ఎంతో మంది బతుకుతారు అంటూ వ్యాఖ్యానించారు. బిజెపి ఎంఐఎం టిఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అని విమర్శించిన జగ్గారెడ్డి… హిందుత్వ పార్టీ అంటూ గొప్పలు చెప్పుకునే బిజెపి గుడి కి కూల్చేస్తే ఏం చేసింది అంటూ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news