హనుమాన్‌ చాలీసతో కరోనాకి చెక్..! బీజేపీ ఎంపీ హాట్ కామెంట్స్..!

-

భారత్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. మాస్క్, సానిటైజర్ లేనిదే ప్రజలు అడుగు బయట పెట్టలేక పోతున్నారు. దీంతో వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అంటూ అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ క్రమంలో దేశంలోని కొందరు నాయకులు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే.. హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ నేత రవిచంద్రగట్టి కరోనా గురించి మాట్లాడుతూ.. ‘90 ఎంఎల్ రమ్‌లో టీ స్పూన్ మిరియలు కలుపుకొని తాగండి. ఆ తర్వాత ఫ్రై చేసిన రెండు కోడి గుడ్లు తినండి. ఇలా చేస్తే కరోనా రాదు అని చెప్పారు.

అలాగే మొన్న బీజేపీ నేత, కేంద్ర జలవనరుల సహాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ మాట్లాడుతూ.. భాభిజీ పాపడ్‌ తింటే కరోనా వైరస్‌ తగ్గుతుందని చెప్పారు. ఇక తాజాగా.. బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ కూడా ఒక విచిత్రమైన చిట్కా చెప్పారు. కరోనాతో పోరాటం సాగించడానికి ప్రజలందరూ వచ్చె నెల అయిదు వరకు రోజుకు ఐదు సార్లు హనుమాన్‌ చాలీసా చదవాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు హనుమాన్ చాలీసాను ఒకే స్వరంలో గానం చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుందని అన్నారు‌. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news