ఏడుస్తూ ప్రచారం చేస్తున్న బీజేపీ సాగర్ అభ్యర్ది

-

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలను దాదాపు మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఒకరకంగా సమయం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. బీజేపీ అభ్యర్థి రవినాయక్ ప్రచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంటే ఒకరకంగా వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టాడు బీజేపీ అభ్యర్థి పానుగోతు రవికుమార్ నాయక్.

సాగర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా త్రిపురారం మండలం లోని  సొంత గ్రామం పలుగు తండా తో పాటు పలు గ్రామాల్లో ఈరోజు ప్రచారం నిర్వహించారు. సొంతగ్రామమైన పలుగుతాండలో ప్రజలను కలుసుకొని ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. తనకు డబ్బు లేదు,గుండె ధైర్యం లేదు,ఒక్క అవకాశాన్నిచ్చి నన్ను అసెంబ్లీకి పంపియ్య౦డంటూ ఓటర్ల వద్ద కన్నీటి పర్యంతమయ్యారు రవి నాయక్. ధైర్యం సరిపోవడం లేదు..ఓటు వెయ్యండి..అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తూ రవికుమార్ నాయక్ ఎన్నికల ప్రచారం చేయడం ఆసక్తికరంగా మారింది. 

Read more RELATED
Recommended to you

Latest news