తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో క్షుద్రపూజల కలకలం

-

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో క్షుద్రపూజల కలకలం రేగింది. ఎస్వీ యూనివర్సిటీ లైబ్రరీ భవనం వద్ద నాలుగు రోడ్ల కూడలిలో క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించాయి. ముగ్గు వేసి, పుర్రె బొమ్మను చిత్రించి, పసుపు కుంకుమ చల్లినట్టుగా గుర్తించారు. ముగ్గు సున్నం, ఉప్పు, బొగ్గుపొడితో ముగ్గు వేసి, రక్తం, కోడిగుడ్లతో పూజలు చేసినట్టుగా భావిస్తున్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వర్సిటీ ప్రాంగణంలో సీసీ కెమెరాలు సరిగా పనిచేయకపోవడం, సెక్యూరిటీ లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

Breaking: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో క్షుద్రపూజల కలకలం

గత కొద్ది రోజులుగా యూనివర్శిటీ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్ధితి నెలకొనడంతో యూనివర్శిటీ అధ్యాపకులు, విద్యార్ధినీ, విద్యార్ధులు భయాందోళనకు గురవుతున్నారు. అంతే కాకుండా రాత్రి సమయాల్లో యూనివర్శిటీ ప్రాంతాల్లో మద్యం సేవించి, వ్యర్ధాలను చెల్లాచెదురుగా పడేసి వెళ్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news