తాజ్​ ఎక్స్​ప్రెస్​లో​ బాంబు కలకలం.. అప్రమత్తమైన అధికారులు

-

స్వాతంత్య్ర దినోత్సవం రోజున తాజ్ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం రేపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దిల్లీ నుంచి బౌంద్​ వెళ్లే తాజ్​ ఎక్స్​ప్రెస్​లో బాంబు ఉన్నట్లు ఓ వ్యక్తి కాల్​ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. రైలులోని ప్రయాణికులందరిని కిందకు దించి తనిఖీలు చేశారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని మథురాలో జరిగింది.


సోమవారం రోజున తాజ్​ ఎక్స్​ప్రెస్​లోని డీ2 బోగిలో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్​ చేశారని జీఆర్పీ పోలీసులు తెలిపారు. దిల్లీ వెళ్లే లోపు పేలుతుందని హెచ్చరించారని చెప్పారు. వెంటనే అప్రమత్తమై రైలును మథురా రైల్వే స్టేషన్​లో నిలిపి తనిఖీలు చేశామని పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు.. నిందితుడిని గుర్తించారు. షాహన్​గంజ్​ ప్రాంతానికి చెందిన ముఖేశ్​ను అరెస్ట్​ చేశారు. నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు.

“తాజ్​ ఎక్స్​ప్రెస్​.. మథురా జంక్షన్​ రైల్వే స్టేషన్​కు ఉదయం 7:29 కు చేరుకోగానే నిలిపివేశాం. ప్రయాణికులను కిందకు దించి పూర్తిగా తనిఖీలు చేశాం. బాంబ్​ డిస్పోజల్​ స్క్వాడ్​, డాగ్​ స్క్వాడ్​, జీఆర్పీ, ఆర్పీఎఫ్​, స్థానిక పోలీసులతో కలిసి ప్రతి కోచ్​ను తనిఖీ చేశాం. దీనికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. తనిఖీలు చేపట్టిన అనంతరం రైలు వెళ్లేందుకు అనుమతిచ్చాం” అని స్టేషన్​ హౌస్​ ఆఫీసర్​ సుశీల్​ కుమార్​ తెలిపారు

Read more RELATED
Recommended to you

Latest news