నేడు జనగామ లో బండి సంజయ్ పాదయాత్ర.. పోలీసులు అలర్ట్

-

జనగామ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ జిల్లాలో బీజేపీ,టీఆర్ఎస్ పోటాపోటీ ఫ్లేక్సీలు,హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. నేడు జనగామ నియోజకవర్గంలోకి బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ఎంట్రీ కానుంది. ఈ తరుణంలోనే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు సవాల్ విసురుతూ టీఆర్ఎస్ హోర్డింగ్స్ ఏర్పాటు చేసింది.

జనగామ అడుగు పెట్టాలంటే నీతి ఆయోగ్ సిఫారసు చేసిన నిధులు తీసుకురావాలనీ డిమాండ్ చేస్తూ ఈ హోల్డింగ్స్ ఏర్పాటు చేసింది టిఆర్ఎస్ పార్టీ. స్వయంగా హోర్డింగ్స్ లు ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. ఇక అటు బండి సంజయ్ పాదయాత్రకు స్వాగతం పలుకుతూ బీజేపీ ఫ్లేక్సీలు ఏర్పాటు చేశారు. అయితే కొన్ని బీజేపీ ఫ్లేక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపేసారు. టీఆర్ఎస్ నాయకులే చించారనీ బీజేపీ నాయకుల ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనగామ పోలీసులు పట్టణంలో హై అలెర్ట్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news