సీఎం ఇంటి వద్ద బాంబు కలకలం.. అప్రమత్తమైన పోలీసులు

-

ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​ ఇంటి సమీపంలో బాంబు కలకలం రేపింది. సీఎం ఇంటి వద్ద బాంబు ఉందని పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే రంగలోకి దిగిన లఖ్​నవూ పోలీసులు యోగి ఇంటి సమీపంలో భద్రతను పటిష్టం చేశారు. బాంబ్​ స్క్వాడ్​ సాయంతో కూంబింగ్​ ఆపరేషన్​ నిర్వహించారు.

సీఎం యోగి ఆదిత్యనాథ్

గంటల పాటు వెతికినా పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు. బాంబ్ లేకపోవడంతో ఊరిపీల్చుకున్న పోలీసులు.. ఎవరో కావాలనే ఫేక్ కాల్ చేసి ఉంటారని భావించారు. కాళీదాస్​ మార్గ్​లోని సీఎం యోగి ఇంటి వద్ద బాంబు ఉందని తమకు సమాచారం వచ్చిందని లఖ్​నవూ డీసీపీ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారని ఆయన వెల్లడించారు.

సీఎం యోగికి ఇలాంటి బెదిరింపులు కొత్తేం కాదు. ఇప్పటికే చాలా సార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇంతకుముందు ఆదిత్యనాథ్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి చంపేస్తానని ట్విటర్​లో బెదిరించాడు.  యోగి భద్రతా సిబ్బందిని కూడా బాంబు పెట్టి చంపేస్తామని హెచ్చరించాడు.

Read more RELATED
Recommended to you

Latest news