ఉద్ధవ్​ ఠాక్రేకు షాక్.. శిందేకే శివసేన పేరు, ఎన్నికల గుర్తు

-

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేకు భారీ షాక్ తగిలింది. శివసేన పేరు, ఆ పార్టీ ఎన్నికల గుర్తు అయిన విల్లు-బాణం.. ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ శిందే నేతృత్వంలోని వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 2018లో సవరించిన శివసేన పార్టీ రాజ్యాంగాన్ని అప్రజాస్వామికంగా అభివర్ణించిన ఈసీ.. ఎలాంటి ఎన్నికలు లేకుండా సొంత కోటరీలోని వ్యక్తుల్ని పార్టీ పదాధికారులుగా అప్రజాస్వామికంగా నియమించుకునేలా రాజ్యాంగంలో మార్పులు చేసుకున్నారని స్పష్టం చేసింది. అలాంటి పార్టీ వ్యవస్థల్ని నమ్మలేమని అభిప్రాయపడింది.

ఏక్‌నాథ్ షిండే-ఉద్ధవ్ ఠాక్రే

1999లో ఎన్నికల సంఘం ఒత్తిడితో అప్పటి అధ్యక్షుడు బాలాసాహెబ్ ఠాక్రే పార్టీ రాజ్యాంగంలో కొన్ని నిబంధనలు చేర్చగా.. వాటిని తీసేస్తూ 2018లో మోసపూరితంగా సవరించారని ఈసీ వివరించింది. ఆ తర్వాత కొత్త రాజ్యాంగాన్ని కూడా ఉద్ధవ్​ ఠాక్రే నేతృత్వంలోని పార్టీ తమకు సమర్పించలేదని స్పష్టం చేసింది. ఈ పరిణామాలన్నింటి దృష్ట్యా.. శివసేన పార్టీ పేరు, ఎన్నికల గుర్తు ఏక్​నాథ్​ శిందే వర్గానికే చెందుతాయని ఈసీ తేల్చిచెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news