వరవరరావును కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి..!

-

భీమా కొరేగావ్‌ కేసులో నిర్భంధంలో ఉ‍న్న విప్లవ రచయిత వరవరరావును కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి లభించింది. ప్రస్తుతం కరోనాతో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను కలిసేందుకు బాంబే హైకోర్టు వారికి అనుమతినిచ్చింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు, ఆస్పత్రి ప్రొటోకాల్‌కు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందని కుటుంబ సభ్యులకు కోర్టు తెలిపింది.

మరోవైపు వరవరరావు ఆరోగ్యంపై మూడు రోజుల్లోగా నివేదిక అందజేయాలని న్యాయస్థానం నానావతి ఆస్పత్రి వైద్యులను ఆదేశించింది. బీమా కొరేగావ్ కేసులో విచారణ ఖైదీగా వరవరరావు జైలులో ఉంటున్నారు. ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలినప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన్ను కలిసేందుకు తమకు అనుమతించాలని.. ఆయన తానుగా ఏ పని చేసుకోలేని స్థితిలో ఉన్నారని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news