సీఎం జగన్‌ ఇంటిని ముట్టడిస్తాం..కొత్త జిల్లాలపై బోండా ఉమ వార్నింగ్‌

-

సీఎం జగన్‌ ఇంటిని ముట్టడిస్తామని బోండా ఉమ వార్నింగ్‌ ఇచ్చారు. తూర్పు కృష్ణాకు యన్టీఆర్‌ జిల్లాగా, పశ్చిమ కృష్ణాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ టిడిపి పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ నిరసన దీక్ష చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ.. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు జిల్లాల విభజన చేస్తారా? కొత్త జిల్లాలతో ఉపయోగం ఏంటి.. అని ఫైర్‌ అయ్యారు.

కొత్త ఉద్యోగం ఒక్కటైనా వస్తుందా.. వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త జిల్లాల ఏర్పాటు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన లు జరుగుతున్నాయని.. రాష్ట్రం బగ్గుమంటుంటే సీఎం జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ఆగ్రహించారు. ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు ఉన్న ప్రాంతానికి మచిలీపట్నం జిల్లా కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని.. పేదల సమస్యల పై పోరాడుతూ ప్రాణాలు అర్పించిన వంగవీటి రంగా పేరు విజయవాడ జిల్లా కు పెట్టాలని డిమాండ్‌ చేశారు. రంగా అభిమానులను కించ పరిచే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందని.. అన్ని పార్టీలను కలుపుకొని రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news