BREAKING: బరోడా మహిళా క్రికెట్ జట్టుకు బస్సు ప్రమాదం

-

విశాఖపట్నంలో బరోడా మహిళా క్రికెట్ జట్టు ప్రయాణిస్తున్న బస్సు కు ప్రమాదం జరిగింది. విశాఖలో జరుగుతున్న మ్యాచ్ ను ముగించుకొని బరోడా జట్టు ఎయిర్పోర్ట్ కు వెళుతున్న సమయంలో తాటి చెట్ల పాలెం జాతీయ రహదారి జంక్షన్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సుకి ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

బస్సులో ఉన్న నలుగురికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న కంచరపాలెం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన వారిని చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news