Breaking : బీజేపీ లీడ‌ర్ డ్రైవ‌ర్ తో స‌హా న‌లుగురు కిడ్నాప్

-

బీజేపీ నాయ‌కుడు జితేంద‌ర్ రెడ్డి డ్రైవ‌ర్ తో పాటు మ‌రో ముగ్గురిని కొంత మంది దుండ‌గులు కిడ్నాప్ చేశారు. బీజేపీ నాయ‌కుడు జితేంద‌ర్ రెడ్డి ఇంట్లో నుంచే ఆయ‌న సిబ్బంది తో పాటు డ్రైవ‌ర్ ను దుండ‌గులు కిడ్నాప్ చేశారు. బీజేపీ నాయకుడు జితేంద‌ర్ రెడ్డి నివాసం.. ఢిల్లీలోని సౌత్ ఢిల్లీ అవెన్యూ లో గ‌ల నంబ‌ర్ 105 నివాసంలో ఉంటున్నారు. అక్క‌డి నుంచే దుండ‌గులు కిడ్నాప్ చేశారు.

దీంతో బీజేపీ నేత జితేంర్ రెడ్డి వ్య‌క్తిగ‌త సిబ్బంది.. ఢిల్లీ సౌత్ అవెన్యూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. బీజేపీ నాయ‌కుడు జితేంద‌ర్ రెడ్డి నివాసం చుట్టు ప‌క్క‌ల ఉన్న సీసీ కెమెరాల‌ను పోలీసులు ప‌రిశీలించారు. ఈ సీసీ కెమెరాల్లో.. జితేంద‌ర్ రెడ్డి డ్రైవ‌ర్ తో పాటు మ‌రో ముగ్గురిని దుండ‌గులు అప‌హ‌రించారు. కాగ కిడ్నాప్ పై పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. కిడ్నాప్ చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news