Breaking news: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల..

-

ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ న్యూస్..నేడు ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానున్నయని సమాచారం.బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ (బీఐఈ) నేడు (శుక్రవారం) ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్ని విడుదల చేస్తుంది.

మే 6 నుంచి 24 వరకూ పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది దాదాపు 4,64,756 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల తర్వాత విద్యార్థులకు డిజిటల్ స్కోర్ కార్డ్స్ అందిస్తారు.

విద్యార్థులు https://bie.ap.gov.in/ సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు ఇంటర్ పాస్ కావాలంటే ప్రతి సబ్జెక్టులో కనీసం 33 మార్కులు సాధించాలి. ప్రభుత్వ స్కాలర్‌షిప్ పొందాలి అంటే విద్యార్థులు 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించాల్సి ఉంటుంది..గత రెండేళ్ళుగా పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే..ఇప్పుడు అన్నీ పరీక్షలను నిర్వహించారు.ఇటీవల విడుదల అయిన టెన్త్ రిజల్ట్స్ నిరాశ పరిచాయి.ఇప్పుడు ఇంటర్ ఫలితాలు ఎలా ఉంటాయో అని విద్యార్థులలో టెన్షన్ మొదలైంది..

Read more RELATED
Recommended to you

Latest news