బ్రేకింగ్: గంగమ్మ జాతరలో కత్తి పట్టి చిందులేసిన సీఐ

-

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లావ్యాప్తంగా గంగమ్మ జాతర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు స్థానికులు అధిక సంఖ్యలో హాజరై ఘనంగా నిర్వహించుకుంటారు. అయితే రెండున్నర ఏళ్లుగా కరోనా కారణంగా ఈ ఉత్సవాలను నిర్వహించలేదు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఏపీలో గంగమ్మ జాతర ఉత్సవాలు అంబరాన్ని అంటుతున్నాయి. వారం రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులు రకరకాల వేషధారణలో ఆకట్టుకుంటారు. రోజుకో వేషం ధరించుకుని అమ్మవారిపై ఉన్న భక్తి చాటుతుంటారు.

అయితే తాజాగా ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భాకరాపేటకు చెందిన సీఐ తులసిరామ్ గంగమ్మ జాతరలో కత్తి పట్టుకుని గంతులేశారు. తన సొంత గ్రామమైన కార్వేటినగరం గంగమ్మ జాతరకు వచ్చిన ఆయన.. స్థానికులతో కలిసి కత్తి పట్టుకుని చిందులేయడం వైరల్ అయింది. డప్పుల దరువులకు తగ్గట్లు ఆయన కత్తిని తిప్పడం అందరినీ ఆకర్షింపజేసింది. అయితే సీఐ సాధారణ దుస్తుల్లో ఇలాంటి పని చేస్తే ఎవరూ పట్టించుకునే వారు కాదు. యూనిఫాంలో ఉన్నప్పుడు కత్తి పట్టడంతో ఆయనపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. కాగా, ఇటీవల తిరుపతి ఎమ్మెల్యే డాక్టర్ మద్దెల గురుమూర్తి వేంకటేశ్వర స్వామి వేషధారణలో అమ్మవారికి మొక్కులు చెల్లించిన విషయం విదితమే.

Read more RELATED
Recommended to you

Latest news