BREAKING: బండి సంజయ్ కి నోటీసులు జారీ

-

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి నోటీసులు జారీ అయ్యాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యల్ని మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. దీంతో ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగతంగా బండి సంజయ్ కమిషన్ ముందు హాజరు కావాలని కోరింది.

మరోవైపు ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బిఆర్ఎస్ మహిళా నాయకులు. బిఆర్ఎస్ ఆందోళనల నేపథ్యంలో ముందస్తు భద్రత పెంచారు పోలీసులు. బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మొహరించారు. కార్యాలయానికి వచ్చే రెండు దారుల వద్ద భారీకేట్లను ఏర్పాటు చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news