బ్రేకింగ్: ఇంట్లో దీక్షకు కూర్చున్న పవన్ కళ్యాణ్

-

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హైదరాబాదులోని తన నివాసంలో ఈ రోజు ఉదయం ధర్మ పరిరక్షణ దీక్షను చేపట్టారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం దగ్ధం ఘటన నేపథ్యంలో జనసేన బిజెపి సంయుక్తంగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ధర్మ పరిరక్షణ దీక్షకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పరిరక్షణ దీక్షకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు, శ్రేణులు ఈ దీక్ష చేపట్టడం గురించి ముఖ్య నాయకులతో పవన్ చర్చలు జరిపారు.

Pawan Kalyan

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ దీక్షలకు అన్ని ఏర్పాట్లు జరిగాయని పవన్ కు నేతలు వివరించారు. ఇక ఇదిలా ఉంటే అంతర్వేదికి భారీగా జనసేన నేతలు తరలి వెళ్ళారు. అలాగే బిజెపి నేతలు కూడా ఈ కార్యక్రమాని విజయవంతం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి అని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news