ప్రేమ పెళ్లి..ఆరునెలలు గడవకముందే…!

-

వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ప్రియుడికి ప్రభుత్వ ఉద్యోగం ఉండటం తో ప్రియురాలు మురిసిపోయింది. పెళ్లి చేసుకుంటే జీవితాంతం సంతోషం గా ఉండవచ్చని కలలు కన్నది. కానీ ఇంతలోనే ఏం జరిగిందో కానీ అనుమానాస్పద రీతిలో చనిపోయింది. ఈ ఘటన కర్ణాటకలోని జిగని సమీపంలో రాజపుర కాలనీలో చోటు చేసుకుంది. అదే కాలనీకి చెందిన యశ్వంత్ బెంగుళూరు టీచర్స్ కాలనీకి చెందిన రాణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. యశ్వంత్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు.

అయితే అతడికి ఇదివరకే పెళ్లి జరగ్గా భార్య తో విడిపోయినట్టు తెలుస్తోంది. ఇక రాణి ని పెళ్లి చేసుకుని ఆరు నెలలు గడవకముందే ఆమె అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. భర్త ఇంట్లోనే. ఉరివేసుకుని శవం అయ్యింది. అయితే రాణి చనిపోయినప్పుడు అత్త మామలు భర్త పట్టించుకోలేదని…కులాంతర వివాహం కావడం వల్ల వాళ్ళే చంపి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన పై జిగని పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news