వదినను గర్భవతి చేసిన మరిది.. భర్తకు తెలిసి..

-

నేటి సమాజంలో బంధాలకు విలువ లేకుండా పోయింది. తల్లి తరువాత తల్లంతాయిన వదినపై కన్నేశాడో దుర్మార్గుడు. అన్న భార్య అని కూడా చూడకుండా ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేసి.. తన కామ వాంఛ తీర్చుకున్నాడు. నరేష్‌ (పేరుమార్చాం), ప్రభు (పేరుమార్చాం)లు అన్నదమ్ములు.. ప్రభు పెద్దవాడు.. నరేష్‌ చిన్నవాడు అయితే.. కుటుంబ సభ్యులు రెండు సంవత్సరాల క్రితం ప్రభుకు రమ్యతో (పేరుమార్చాం) పెళ్లి చేశారు. ఉద్యోగ నిమిత్తం నగరంలో ప్రభు, రమ్యలు ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఉన్నారు. అయితే నరేష్‌ ఉద్యోగం కోసం నగరానికి వచ్చాడు. అయితే నరేష్‌ కన్ను వదిన రమ్యపై పడింది. రమ్యను ఎలాగైనా లొంగ తీసుకోవాలని పథకం పన్నాడు.

Patna Husband appealed police for justice amidst illicit relations between brother in law and sister in law bihar crime news | बंद कमरे में गंदा काम करते हुए पकड़े गए देवर-भाभी, पति

 

ఓ రోజు అన్న ఉద్యోగం పని మీద వేరే ఊరు వెళ్లాడు. దీంతో ఇదే అదునుగా భావించిన నరేష్‌.. ఆ రోజు రాత్రి కూల్‌ డ్రింక్‌లో మత్తు మందు కలిపి రమ్యతో త్రాగించాడు. అనంతరం రమ్య బెడ్‌ రూంలోకి వెళ్లి మత్తులోకి జారీకుని గాఢ నిద్రలోకి వెళ్లింది. దీంతో నరేష్ వదిన రమ్యపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా రమ్యను నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీశాడు. మరుసటి రోజు ఆ ఫోటోలు, వీడియోలు చూపించి రమ్యను బెదిరించాడు.. ఎవరికైనా చెబితే నీ ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో పెడుతానని బెదిరించాడు. పలుమార్లు వదిన రమ్యపై నరేష్‌ అత్యాచారం చేశాడు. రమ్య గర్భం దాల్చడంతో.. 3 నెలల తరువాత ఊరు నుంచి వచ్చిన భర్త ప్రభుకు తన తమ్ముడు చేసిన నిర్వాకం గురించి చెప్పడంతో.. నరేష్‌కు కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేసి.. పోలీస్‌ స్టేషన్‌లకు అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Latest news