రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లోకి రేఖా నాయక్‌

-

ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ లో చేరారు. ఆర్మూర్ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా రేఖానాయక్ ను కాదని ఖానాపూర్ బీఆర్ఎస్ టికెట్ ను భూక్యా జాన్సన్ నాయక్ కు కేటాయించింది అధిష్టానం. ఈ క్రమంలో ఆమె బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ ఆమెకు టికెట్ ఇస్తుందో లేదో చూడాలి. కాగా రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు.

Rekha Nayak: కాంగ్రెస్‌లో చేరనున్న ఎమ్మెల్యే రేఖా నాయక్‌ | mla rekha naik  to join congress

మరోవైపు, రాహుల్ చేపట్టిన మూడు రోజుల బస్సు యాత్ర ఈరోజు ఆర్మూరు సభతో ముగిసింది. ఈ సభలో రేఖా నాయక్ కాంగ్రెస్ లో చేరారు. ఈ నెల 18న రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ బస్సు యాత్రను ప్రారంభించారు. రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం యాత్రను చేపట్టారు. ములుగు, భూపాలపల్లి, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, చొప్పదండి, ఆర్మూర్ నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగింది. ఈ రాత్రి రాహుల్ ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news