ఢిల్లీ ఈడీ కార్యాలయం వద్దకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు

-

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు కోసం ఈడీ అధికారులు ఇంకా విచారణలు చేపడుతూనే ఉన్నారు. ఈరోజుతో వరుసగా రెండవ రోజు కవితను ఈడీ అధికారులు విచారించడం . ఈ రోజు ఉదయం 11.30 గంటలకు దర్యాప్తు మొదలు పెట్టిన ఈడీ ఎంక్వెయిరీ బృందం కవిత ను ఇంకా విచారిస్తూనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలకంగా వ్యవహారించిన సౌత్ గ్రూప్, బుచ్చిబాబు.. పిళ్లైలతో గల సంబంధం.. సిసోడియా, విజయ్ నాయర్‌లతో గల రాజకీయ సంబంధాలపై దాదాపు 7 గంటలకు పైగా ఈడీ అధికారులు కవితను ప్రశ్నించినట్టు తెలుస్తుంది.

అంతేకాకుండా ఈ రోజు కవిత తన పాత ఫోన్‌లను కూడా విచారణకు తీసుకెళ్లిన నేపథ్యంలో ఇవాళ్టి విచారణకు ప్రాధాన్యత సంతరించుకుంది. రాత్రి అవుతోన్న కూడా కవిత ఈడీ విచారణ ముగియకపోవడం.. ఈ స్కామ్‌లో కవిత అరెస్ట్ అవుతారంటూ వార్తలు వినిపిస్తోన్న నేపథ్యంలో ఏం జరగబోందో అని బీఆర్ఎస్ కార్యకర్తల్లో హడావిడి కనిపిస్తుంది. కవితకు మద్దతుగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయం వద్ద చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఈడీ కేంద్ర కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర బలగాలను రంగంలోకి దింపి భద్రతను కట్టుదిట్టం చేశారు వారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ కవిత లీగల్ టీమ్ కూడా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news