వైఎస్‌ సునీతకు కేసీఆర్‌ రక్షణ కల్పించాలి : బుద్దా వెంకన్న

-

వైఎస్‌ సునీత రెడ్డి హైదరాబాదులో ఉంటుంది కనుక కేసీఆరుకు విన్నవిస్తున్నా.. ఆమె కుటుంబానికి కేసీఆర్ రక్షణ కల్పించాలని కోరారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. వివేకా హత్య ఎవరు చేశారో ప్రజలకు సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. మహిళా దినోత్సవం నాడు.. రోజా తిడుతుంటే జగన్ ముసి ముసి నవ్వులు నవ్వుతున్నారని.. రోజా మాట్లాడితే విలువ ఉండదు.. ఆమె గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని ఫైర్‌ అయ్యారు.

budda venkanna

సునీతమ్మను కేసులో ఇరికించేలా ప్లాన్ చేయడం దుర్మార్గమని.. వివేకా హత్య జగన కు తెలిసే జరిగిందని ఆరోపణ చేశారు. అవినాష్ రెడ్డి ఎందుకు నోరు విప్పడం లేదు..? అని నిలదీశారు. అవినాష్ ను పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయడం లేదు..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివేకా హత్య కేసు పై కోర్టుకు వెళ్తామని… ఇలా మాట్లాడితే మాపై కేసులు పెట్టవచ్చు, దాడులు చేయొచ్చు.. ఎదుర్కోవడానికి మేము సిద్ధమని సవాల్‌ విసిరారు. పులివెందుల నుంచి బీటెక్ రవి పోటీ చేస్తారని చంద్రబాబు స్పష్టంగా చెప్పారని.. సునీత ఎందుకు పోటీ చేస్తుందని నిలదీశారు. సునీత వెనుక టిడిపి లేదని.. ఆమె పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు టీడీపీ నేత బుద్దా వెంకన్న.

Read more RELATED
Recommended to you

Exit mobile version