రాజ్యంగాన్ని మార్చడం నీ తరం కాదు..మసైపోతావ్ : కేసీఆర్‌ కు బండి సంజయ్‌ వార్నింగ్‌

-

రాజ్యంగాన్ని మార్చడం నీ తరం కాదు.. ఒక్క పేజీ కూడా మర్చలేవ్… దమ్ముంటే ముట్టుకుని చూడు… మసైపోతవ్ అంటూ తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ కు బండి సంజయ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. చివరకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా తిరగరాయాలని చెబుతున్నడంటే ఎంత బరితెగించి మాట్లాడుతున్నడో అర్ధం చేసుకోవచ్చని.. రాజ్యాంగాన్ని తిరగ రాయడం కేసీఆర్ తాత తరం కాదు. నువ్వెంత అవకాశవాడివో…నువ్వెంత వివాదాస్పదుడివో. తెలిసిపోతోందని నిప్పులు చెరిగారు.

ఈ సందర్భంగా కేసీఆర్ ను హెచ్చరిస్తున్నా…. దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ పక్షాన హెచ్చరిస్తున్నామని.. లేనిపక్షంలో రాష్ఠ్రవ్యాప్తంగా బీజేపీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని పేర్కొన్నారు.

కేసీఆర్ సీఎం పదవి చేపట్టినంక మొట్టమొదట మోసం చేసింది దళితులనేనని… తెలంగాణ వస్తే దళితుడినే మొదటి ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచినంక మాట తప్పాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తానే సీఎం పదవి చేపట్టి దళితులను దారుణంగా మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని.. దళితుడికి సీఎం పదవి ఏమైందని జనం నిలదీస్తుంటే… చర్చను దారి మళ్లించేందుకు ఒక్కో దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమిని పంపిణీ చేస్తామని మాయ మాటలు చెప్పాడని ఆగ్రహించారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news