లోయలో పడ్డ బస్సు.. 23 మంది ప్రయాణికులు మృతి

-

ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన నియమ నిబంధనలు అమలు చేసినా… రోడ్డు ప్రమాదాలు తగ్గడం లేదు. అతి వేగం, తాగి నడపటం కారణంగా ఈ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే.. తాజాగా మన దాయాది దేశమైన పాకిస్థాన్‌ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్‌ బస్సు అదుపు తప్పి లోయలో పడింది.

ఈ ఘోర ప్రమాదం లో ఏకంగా 23 మంది ప్రయాణికులు మరణించారు. మరి కొంత మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సు లో 40 మంది ఉన్నట్లు తెలుస్తోంది. 40 మంది ప్రయాణికులతో బస్సు రావల్పిండికి వెళుతుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారు ప్రస్తుతం ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news