సజ్జన్నార్ మరో సంచలన నిర్ణయం…!

-

ఆర్టీసి ఎండీగా సజ్జన్నార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ బాస్ గా సజ్జన్నార్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగా ఆర్టీసి లోనూ అదే దూకుడు కనబరుస్తున్నారు. ఆర్టీసి అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక గతం లో వివాహాది వేడుకలకు ఆర్టీసి బస్సులు బుక్ చేసుకోవాలంటే ముందుగా డిపాజిట్ చేయాల్సి ఉండేది. దానివల్ల చాలామంది వెనకడుగు వేసేవాల్లు. అయితే ఇప్పుడు డిపాజిట్ లేకుండానే బస్సులను బుక్ చేసుకునే అవకాశాన్ని తెలంగాణ ఆర్టీసి అందుబాటులోకి తీసుకువచ్చింది.

దీనికి సంబంధించి ఆర్టీసి గురువారం ట్వీట్ చేసింది. వేడుకల కోసం బస్సు కావాలనుకుంటే నేరుగా డిపో మేనేజర్ లను సంప్రదించాలని పేర్కొంది. ఇక ఆర్టీసి తీసుకున్న ఈ నిర్ణయం తో ఎప్పుడు కావాలంటే అప్పుడు బస్సును బుక్ చేసుకునే అవకాశం ఉంది. దాంతో ఈ నిర్ణయం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్న సజ్జన్నార్ ప్రజల నుండి ప్రభుత్వం నుండి ప్రశంసలు అందుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version