దీదీ హవా.. కమలం ఢీలా.. ఉప ఎన్నికల్లో ఎదురు దెబ్బ

-

దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నకల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. తాజా జరిగిన 4 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎక్కడా ప్రభావం చూపెట్టలేదు. ముఖ్యంగా బెంగాల్ లో జరిగిన మూడు అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయింది. దీంతో పాటు ఒడిషాలోని ఒక స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ ఓడిపోయింది. దేశం ద్రుష్టిని ఆకర్షించిన భవానీపూర్ ఉపఎన్నికల్లో మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రివాల్పై  విజయం సాధించింది. సంషేర్ పూర్ ఉప ఎన్నికల్లో ఇమ్రుల్ ఇస్లాం, జంగీపూర్ లో జకీర్ హుసెన్లు త్రుణమూల్ కాంగ్రెస్ తరుపున గెలుపొందారు. ఇదే విధంగా ఒడిషాలో పిప్లీ నియోజకవర్గం నుంచి బిజూ జనతాదళ్ అభ్యర్థి రుద్రప్రతాప్ మహారథి గెలుపొందారు. నాలుగు నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదు.

Read more RELATED
Recommended to you

Latest news