ఏపీలో భారీగా తగ్గిన కరోనా.. కొత్తగా 765 కేసులు

-

ఏపీలో కరోనా కేసులు ఇవాళ మళ్లీ తగ్గాయి. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 765 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,52, 763 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 09 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 204 కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 10,357 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 973 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,28, 202 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 45, 481 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 84, 45, 952 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా కేసులు తగ్గుతున్న సర్కార్ మాత్రం.. చాలా కటినంగా కోవిడ్ రూల్స్ ను అమలు చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news