IND vs AUS :నేటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా పుంజుకుంటుందా ?

-

వరల్డ్ కప్ తర్వాత ఇండియా ఆస్ట్రేలియా జట్లు మరోసారి తలపడుతున్నాయి. అయిదు టీ20 ల సిరీస్ లో భాగంగా ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్ లలో ఇండియా గెలిచి సిరీస్ లో 2 – 0 తో ముందంజలో ఉంది. ఇప్పుడు సిరీస్ ను కాపాడుకోవాలంటే మిగిలిన మూడు మ్యాచ్ లను తప్పక గెలవాల్సిన పరిస్థితి అని చెప్పాలి. అందులో భాగంగా ఈ రోజు గౌహతి వేదికగా మూడవ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో కనుక ఇండియా గెలిస్తే మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే సిరీస్ ను గెలుచుకుంటుంది.. ఇక రెండు మ్యాచ్ లలోనూ ఇండియా 200 కు పైగానే పరుగులు సాధించడం విశేషం. ఇక కొత్తగా కెప్టెన్ గా ఎంపికైన సూర్య కుమార్ యాదవ్ జట్టును చాలా సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నాడు. ఇక జైస్వాల్, గైక్వాడ్, సూర్య, ఇషాన్ కిషన్ మరియు రింకు సింగ్ లు చెలరేగి ఆడుతున్నారు.

ఇక ఆస్ట్రేలియా జట్టులో దాదాపు సీనియర్ ప్లేయర్లు ఉన్నప్పటికీ యువకులతో నిండిన ఈ జట్టును ఓడించలేక సతమతమవుతోంది. మరి వరుస మూడవ మ్యాచ్ లోనూ గెలిచి ఇండియా సిరీస్ ను సాధిస్తుందా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news