జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ లో కారు బీభత్సం.. ముగ్గురికి తీవ్ర గాయాలు !

-

ఈ రోజుల్లో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం అయిపోయాయి. మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా ప్రమాదానికి గురి కామని నమ్మకంగా చెప్పలేని పరిస్థితి. మనం జాగ్రత్తగానే ఉన్నా ఎదుటివారు వచ్చి గుద్దే పరిస్థితి,? తాజాగా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద కారు బీభత్సం సృష్టించింది.. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న బైక్ లను గుద్ది అక్కడి నుంచి ముందుకు వెళ్ళింది. కారు కింద పడి ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఎవరైనా ఏమైనా చేస్తారు ఏమో అని భయంతో కారు డ్రైవర్ అక్కడ కార్ ను ఆపకుండానే వెళ్ళిపోయాడు..

ప్రస్తుతం ఈ ఘటన హైదరాబాద్ లో సంచలనం రేపుతోంది.. హైదరాబాద్ లో ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట యాక్సిడెంట్ కి సంబంధించిన వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి.  కానీ ఈ ఘటన మాత్రం సంచలనం రేపుతోంది. గాయాలైన వారు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఆ కారు ఎవరిది ? ఎవరు డ్రైవింగ్ చేశారు అనే అంశాల మీద దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం..

Read more RELATED
Recommended to you

Latest news