వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు.. అక్కడికక్కడే నలుగురు దుర్మరణం

-

కరీంనగర్: చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. కొత్తపల్లి-హుస్నాబాద్ రహదారి సమీపంలో పౌల్ట్రీ ఫారం ఎదురుగా ఉన్న బావిలోకి కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

 

కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వెళ్తుండగా ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటన స్థలంలో సహాయ చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు అదుపు తప్పడంతోనే ప్రమాదం జరిగిందా..?. లేదా ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో ఉన్న స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. కారు అతివేగమే కారణమా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

 

ఇక ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలని, రోడ్డు రూల్స్ పాటించాలని పోలీసులు కోరుతున్నారు. మద్యం సేవించి వాహనాలు అసలు నడపొద్దని సూచించారు. కారు నడిపే సమయంలో సీటు బెల్టు తప్పనిసరిగా పెట్టుకోవాలని, వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూ వాహనాలు నడపాలని పోలీసులు పిలుపు నిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news