ట్రాక్టర్ నడిపాడని నారా లోకేష్ మీద కేసు..

-

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పోలీస్ స్టేషన్ లో టిడిపి జాతీయ కార్యదర్శి లోకేష్ పై కేసు నమోదు అయింది. పలు కారణాలతో అక్కడి లోకల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద అవగాహన లేకుండా ట్రాక్టర్ నడుపుతూ.. పది మందిని ట్రాక్టర్ ఎక్కించుకుని, వారి ప్రాణాలకు హాని కలిగే విధంగా డ్రైవింగ్ చేశారని ఒక కారణం అలానే కోవిడ్ 19 నిబంధనలు పాటించకుండా కార్యక్రమాలు నిర్వహించినందుకు మరో కేసు సుమోటోగా నమోదు చేశారు.

ఈ సందర్భంగా లోకేష్ స్పందిస్తూ రైతుల్ని పరామర్శించడం,రైతులకి అండగా పోరాటం చెయ్యడం,రైతులకి న్యాయం చెయ్యమని డిమాండ్ చెయ్యడం జగన్ రెడ్డి దృష్టిలో నేరం అని అయితే ఈ నేరం పై కేసు పెట్టే సెక్షన్లు ఆయన పోలీసుల వద్దలేవు అందుకే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘన, ట్రాక్టర్ నడిపారంటూ నాపై కేసులు బనాయించారని అన్నారు. వరద బాధితులను పరామర్శించేందుకు గడప దాటని జగన్ రెడ్డి, గడప గడపకీ వెళ్లే నన్ను అడుగడుగునా అడ్డుకోవాలనుకుంటున్నారు. ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో! కష్టాలలో ఉన్నోళ్ల కన్నీరు తుడిచేందుకు ప్రతీ ఊరూ వెళతా! ప్రతి గడపా తొక్కుతా! బాధితులకు భరోసానిస్తానని అయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news