22 మంది ఎంపీలు ఉన్నా ఉపయోగం లేదా…?

-

పోలవరం ప్రాజెక్టు వైసీపీ అవినీతి, రివర్స్ పాలనా వల్ల ముందుకు వెళ్ళటం లేదు అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ఆరోపణలు చేసారు. చంద్రబాబు హయాంలో 71 శాతం పనులు పూర్తయ్యాయి అది నిజమా, కాదా? వైసీపీ చెప్పాలి అని ఆయన డిమాండ్ చేసారు. చంద్రబాబు హయాంలో కేంద్రం 55 వేల కోట్లు టెక్నికల్ శాంక్షన్ ఇచ్చింది నిజమా, కాదా? అని ఆయన ప్రశ్నించారు.

చంద్రబాబు హయాంలో పనులు ప్రపంచ రికార్డులు సాధించే విధంగా సాగాయి నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం లో జరుగుతున్న అవినీతి వల్లే పోలవరం కి నిధులు కేంద్రం ఇవ్వటం లేదు అని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పోలవరంలో ఏ అవినీతి జరగలేదని కేంద్రం పార్లమెంటులోనూ చెప్పింది అని ఆయన అన్నారు. 22 మంది ఎంపీలు వుండి పోలవరం నిధులు తెలేకపోవటం వైసీపీ అసమర్ధత కాదా? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news