నలంద కిషోర్ మరణానికి ప్రభుత్వమే కారణం: చంద్రబాబు నాయుడు

-

ఆంధ్రప్రదేశ్​ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిషోర్ మరణానికి ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని టిడిపి అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. నలంద కిషోర్ మృతిపట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కిషోర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వై ఎస్ ఆర్ సి పి వేధింపులతో మనస్థాపానికి గురై కిషోర్ మృతి చెందాడని విమర్శించారు.

chandra babu
chandra babu

ప్రభుత్వ దుశ్చర్యలను ఖండిస్తున్నా… సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడని నలంద కిషోర్​పై కేసులు బనాయించారు. కరోనా పరిస్థితుల్లో విశాఖ నుంచి కర్నూలుకు తరలించారు. పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పి శారీరకంగా, మానసికంగా హింసించారు. ఈ క్షోభ తట్టుకోలేకే తీవ్ర మనోవేదనకు గురయ్యాడు నలంద కిషోర్‌. ఆయన మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని చంద్రబాబు అన్నారు. నలంద కిషోర్ మృతిపై నారా లోకేశ్ కూడా స్పందించారు. ఆయన మృతి చాలా బాధాక‌రమని సంతాపం ప్రకటించారు. పార్టీ ఓ క్రమ‌శిక్షణ క‌లిగిన నాయ‌కుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. కిషోర్ కుటుంబస‌భ్యుల‌కు‌ సానుభూతి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news