ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ… బీసీల కోసం కొత్త పోరాటం !

-

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. బీసీ జన గణన చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోడీని లేఖలో కోరారు చంద్రబాబు నాయుడు. బీసీలకు సంబంధించిన సరైన డేటా లేక పోవడంతో ఆ వర్గాలకు అన్యాయం జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు నారా చంద్ర బాబు నాయుడు.

ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా బీసీలు అన్ని రకాలుగా వెనకబడే ఉంటున్నారని గుర్తు చేశారు చంద్రబాబు. బీసీ జన గణన పక్కాగా జరిగి తేనే బీసీలకు సంక్షేమ ఫలాలు అందుతాయని డిమాండ్‌ చేశారు.

బీసీ జన గణన చేపట్టాలని గత ప్రభుత్వ హయాంలోనే అసెంబ్లీలో ఏకగ్రీన తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపామని గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు. కులాల వారీగా అందు బాటు లో ఉన్న జనగణన వివరాలు 90 ఏళ్ల క్రితానివి.. అది ఇప్పుడు పనికి రాదని పేర్కొన్నారు. తమ విజ్ఞప్తి పై ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే స్పందించాలని కోరారు చంద్రబాబు.

 

Read more RELATED
Recommended to you

Latest news