చంద్రబాబు నాయుడు డీఎన్ఏలోనే హత్యా రాజకీయాలు: మంత్రి కారుమూరి

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారం కోసం సొంత మామనే వెన్ను పోటు పొడిచారని..హత్యా రాజకీయాలు చంద్రబాబు డీఎన్ఏలోనే ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో కిరాణా షాపుల్లో గంజాయి దొరుకుతుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైన మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు బంధువులే ఏపీలో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. కిరాణా షాపుల్లో గంజాయి దొరుకుతుందంటూ బాబు యావత్ ఆర్యవైశ్యులను అవమానపర్చారని ఆయన మండిపడ్డారు.ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుని ఆర్యవైశ్యులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని మంత్రి కారుమూరి డిమాండ్ చేశారు. చంద్రబాబు మాయ మాటలు నమ్మే స్థితిలో ఏపీ ప్రజలు లేరని ,మరోసారి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుందని, జగన్ రెండవ సారి ముఖ్యమంత్రి అవుతారంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version