ఎంపీ రఘురామకృష్ణరాజును హత్య చేయాలని చూస్తున్నారు – చంద్రబాబు

-

ఎంపీ రఘురామకృష్ణరాజును హత్య చేయాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. యలమంచిలి మండలం దొడ్డిపట్లలో చంద్రబాబు ఈ కామెంట్స్ చేశారు. బాబాయ్ నీ చంపి నా మీద పెట్టారు.. రఘు రామకృష్ణమ్ రాజుని చంపాలని చూసారు..ఇంకా ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి.. హత్య రాజకీయాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.

వరద ముంచుకోస్తుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పొయిందని ఆగ్రహించారు. గోదావరి వరద సమయంలో గండ్లు పడకుండా కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు నాయుడు. గట్టు తెగుతుంటే సకాలంలో యువత చేసిన కృషి , దేవుడి దయతో మీరంతా సురక్షితంగా వున్నారు..ప్రమాదం ముంచుకొచ్చినపుడు ప్రజలకు దగ్గరగా వుండాల్సిన ముఖ్యమంత్రి గాల్లో తిరుగుతున్నాడని మండిపడ్డారు.
ఎన్నికలు వస్తుంటే మంత్రులను పంపుతారు.. వరదలు వస్తె ఎవ్వరినీ పంపరు..పేదవాడికి న్యాయం జరిగే వరకు టిడిపి పోరాటం కొనసాగుతోందని చెప్పారు. ముంపు ప్రాంతాల్లో కూడా త్వరలో పర్యటిస్తా..వైసీపీ ప్రభుత్వాలు అన్ని వర్గాలు నాశనం అయ్యాయని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news