చంద్రబాబు కి షాక్ ఇచ్చిన పోలీసులు… బస్ యాత్రకు బ్రేక్…!

-

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలి అంటూ జరుగుతున్న పోరాటం తీవ్ర రూపం దాలుస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా విజయవాడ లోని బెంజ్ సర్కిల్ లో అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అక్కడకు అఖిల పక్ష నేతలతో కలిసి చంద్రబాబు పాదయాత్రగా,

వెళ్ళే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే అమరావతి 13 జిల్లాల బస్ యాత్రకు పోలీసులు షాక్ ఇచ్చారు. జేఏసీ చేపట్టిన 13 జిల్లాల బస్సుయాత్రను అడ్డుకున్నారు. వారు ప్రయాణించాలనుకున్న బస్సులను పోలీసులు సీజ్ చేయడంతో వివాదం మొదలయింది. దీన్ని నిరసిస్తూ చంద్రబాబు, అఖిలపక్ష నేతలు పాదయాత్రగా బస్సులు సీజ్ చేసిన ప్రాంతానికి వెళ్ళారు.

వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు సీజ్ చేసిన బస్సులను వెంటనే అమరావతి జేఏసీకి అప్పగించాలని ఈ సందర్భంగా చంద్రబాబు సహా అఖిలపక్ష నేతలు డిమాండ్ చేసారు. అదే సమయంలో చంద్రబాబు పాదయాత్రను విరమించుకోవాలని పోలీసులు కోరగా చంద్రబాబు, అఖిలపక్ష నేతలు రోడ్డు మీదే ధర్నాకు దిగారు. చంద్రబాబుకి పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news