ఆంధ్ర ప్రదేశ్ ను మద్యాంద్రప్రదేశ్ గా మార్చారు : చంద్రబాబు

-

సీఎం జగన్ మాట తప్పారని.. మద్యాన్ని పూర్తిగా నిషేధం చేస్తామన్న ఎన్నికల హామీని అధికారంలోకి వచ్చాక మరిచారని ఫైర్ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. మద్య నిషేధమని హామీనిచ్చి నేడు రాష్ట్రాన్ని మద్యాంద్రప్రదేశ్ గా మార్చారని.. పేదల పొట్టకొట్టి మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడం గాంధీజీ ఆశయమా. ? అని నిలదీశారు చంద్రబాబు.

chandrababu naidu ys jagan

మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెడుతున్నారని.. అప్పులు చేయటమే గాంధీజీ సిద్ధాంతమా..? అని ప్రశ్నించారు చంద్రబాబు. టీడీపీ ప్రభుత్వం చెత్త నుంచి సంపద సృష్టికి అడుగులు పడితే నేడు చెత్తపై కూడా పన్నులు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. మద్యం ఆదాయాన్ని గతంకంటే 75 శాతం పెంచారని.. రూ.20కే తయారయ్యే మద్యం సీసాను రూ. 200లకు అమ్ముతూ ఏడాదికి రూ.5 వేల కోట్ల మేర జే.ట్యాక్స్ దోచుకుంటున్నారని మండిపడ్డారు చంద్రబాబు.

అంతకు ముందు నారా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులకు జీవించే హక్కు లేదని గాంధీ జయంతి రోజే దళితుల తలలు పగలగొట్టి మరీ వైసీపీ నేతలు చెప్పారని ఫైర్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం సుంకరిపేటలో దళితులపై వైసీపీ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. దళితుల పై దాడికి తెగబడిన వైసీపీ నాయకుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news