కేసీఆర్ పరామర్శించిన చంద్రబాబు

-

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వీలైనంత త్వరగా కోలుకొని ప్రజాసేవకు రావాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను చంద్రబాబు పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి వెలుపల చంద్రబాబు మాట్లాడుతూ.. కేసీఆర్ త్వరగా కోలుకుంటున్నారని చెప్పారు.

కేసీఆర్ తో మాట్లాడాలనిపించి వచ్చాను. కోలుకోవడానికి ఆరు వారాల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. డాక్టర్లు చాలా చక్కగా ఆపరేషన్ చేశారు. త్వరలోనే కేసీఆర్ మామూలుగా నడుస్తారని చంద్రబాబు తెలిపారు. యశోద ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్ ను పలువురు నేతలు పరామర్శిస్తున్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేసీఆర్ ని కలిసి మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్, బీఎస్పీ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కూడా కేసీఆర్ ను పరామర్శించి క్షేమ సమాచారం తెలుసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news