AP డీజీపీ గౌతమ్ సవాంగ్ కు చంద్రబాబు లేఖ

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగుకు తెలుగు దేశం పార్టీ అధినేత‌ చంద్రబాబు నాయుడు బ‌హిరంగ‌ లేఖ రాశారు. కర్నూల్ జిల్లా కోసిగి మండలంలో తెలుగు దేశం పార్టీ నేత తిక్కారెడ్డి పై దాడి ఘటన లో చర్యలు తీసు కోవాల‌ని ఈ లేఖ ద్వారా ఏపీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ ను డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు.

chandrababu naidu

క‌ర్నూల్ జిల్లా బొంపల్లె లో ఆలయానికి వెళ్లిన త‌మ పార్టీ తిక్కారెడ్డి పై వైసీపీ కార్య‌క‌ర్త‌లు దారుణంగా దాడి చేశారని నిప్పులు చెరిగారు. వైసీపీ కార్యకర్తల దాడిలో ఐదుగురు టీడీపీ పార్టీ కార్య కర్తలు తీవ్రంగా గాయపడ్డారని లేఖ లో పేర్కొన్నారు చంద్ర‌బాబు. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లో వైసీపీ అరాచకాలను అడ్డుకోవడంవో పోలీసులు విఫలం అవుతున్నారని నిప్పులు చెరిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసు కోవాలని… తిక్కారెడ్డికి తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news